జనసేనలో చేరిన బొందిలి కాశీరాం సింగ్

మార్కాపురం నియోజకవర్గం: అల్లూరి పోలేరమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ బలహీన వర్గాల నాయకుడు బొందిలి కాశీరాం సింగ్ బుధవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.