సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా అప్డేట్

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమా అలా ఉండగానే అఖిల్ హీరోగా 5వ సినిమా అప్డేట్ వచ్చింది. కొన్నాళ్ళుగా డిస్కషన్స్ లో ఉన్న సురేందర్ రెడ్డి సినిమానే ఫిక్స్ చేస్తూ అఖిల్ సినిమా గురించి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ రావిపుడి నిర్మాతగా ఈ కాంబో సినిమా ఫిక్స్ చేశారు.