ముసునూరు 15వ వార్డ్ లో జనసేన తరపున అళహరి సుధాకర్ విస్తృత ప్రచారం
జనసేన కావలి నియోజకవర్గం ఇంచార్జి అళహరి సుధాకర్ అధ్యక్షతన కృష్ణ – పెన్నా వీరమహిళ కమిటీ మెంబర్ శ్రీమతి నాగరత్నం యాదవ్ గారి ఆధ్వర్యంలో కావలి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డ్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతీ ఇంటికి వి.పి.ఆర్ ని ఎంపీగా కావ్య కృష్ణా రెడ్డి గారిని ఎమ్మెల్యే గా గెలిపించుకోవడం కావలికి ఎంతో అవసరమని, సేవచెయ్యడానికి వచ్చిన వీరిని గెలిపించి దొంగలను ఇంటికి పంపుదామ్ అనే పిలుపుతో విశృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమములో నెల్లూరు నుండి వచ్చిన వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-27-at-18.42.25-1024x340.jpeg)