మిరియాల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

*మిరియాల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజనులతో జనసేన ఆధ్వర్యంలో నిరసన
*గిరిజనులతో నిరసన తెలిపిన జనసేన ఎక్స్ ఎం.పి.టి.సి సాయి బాబా, రామకృష్ణ, రవీంద్ర

అరకు వేలి మండలం పేదలబుడు పంచాయతీ పరిధిలో గల గర్ద గూడ గ్రామంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా, అల్లంగి, రామకృష్ణ, రవీంద్ర ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి జనసేన మాటలు, సిద్ధాంతాలు తీసుకెళ్తు.. గిరిజనులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ముఖ్యంగా గిరిజనుల పండించిన మిరియాల కు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని జనసేన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన సొంత పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులు పండించిన మిరియాలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం గిరిజనులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజనులతో నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.