జనసేనలో చేరిన ఆలమూరు శెట్టిబలిజ యువత

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం ఆలమూరు శెట్టిబలిజ యువత కట్టా రాజు, గుడాల నాగబాబు ఆధ్వర్యములో కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జి బండారు. శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరిని బండారు శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేడిశెట్టి మహేష్ చిట్టిమెను రమేష్, కోటా వీరబాబు, చెల్లుబోయిన అర్జున్, శీలం దుర్గాప్రసాద్ తదితరులు. పార్టీలో చేరుతూ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, సేవా కార్యక్రమాలు రైతు కుటుంబాలను తన సొంత డబ్బుతో ఆదుకుంటున్న విదానం పట్ల ఆకర్షితులమై పార్టీ లోచేరామని..వారు తెలిపారు. ఈ సందర్బంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు పార్టీలో చేరిన మీ అందరికి పార్టీ నుండి పూర్తి సహకారం ఉంటుందని పార్టీ ఆశయాలకు కట్టుబడి మనమంతా పవన్ కళ్యాణ్ తో పయనిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులా రాజు, మహదశ బాబులు, అనసూరి లక్ష్మణ్, అనసూరి రాము, కడియాల స్వామి, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.