మాది మిడిల్ క్లాసు – మన గుర్తు గాజు గ్లాసు

విజయనగరం, “మాది మిడిల్ క్లాసు – మన గుర్తు గాజు గ్లాసు” అనే కార్యక్రమంతో శనివారం నుండి విజయనగరం నియోజకవర్గంలో గాజు గ్లాసు సందడి చేయనుంది. జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను మరియు పార్టీ “గాజు గ్లాసు” గుర్తును నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువచేసే దిశగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి, మరియు జనసేన-టీడీపీ రాష్ట్ర సమన్వయకర్త శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో విజయనగరం స్థానిక ఆర్ అండ్ బి జంక్షన్ దగ్గరగల రైతు బజార్ వద్ద శనివారం ఉదయం నుండి జనసేన పార్టీ గుర్తు “గాజు గ్లాసు” తో ఉచితంగా టీ పంపిణీతో పాటు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.