క్రీస్తు బోధనల స్ఫూర్తితో అందరూ ఐక్యంగా ఉండాలి

ఏలూరు, క్రైస్తవులందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు యేసుక్రీస్తును ప్రార్థించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సోమవారం ఏలూరు నగరంలోని ఇండియన్ క్రిస్టియన్ మిషన్ చర్చి, ఇండియన్ పెంతుకోస్తు చర్చి, విశ్వాసపురి ధ్యాన కేంద్రాల్లో క్రైస్తవ సోదర, సోదరీమణులను కలుసుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ యేసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన క్రీస్తు జన్మదినం ప్రజలందరికీ పండుగ రోజు అని చెప్పారు. ప్రేమ, దయాగుణాన్ని అందరికీ పంచుతూ క్రీస్తు బోధించిన కరుణ, మానవత్వం చూపుతూ ప్రజలందరూ సంతోషంగా జీవించేలా ముందడుగు వేయాలన్నారు. ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనల స్ఫూర్తితో అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసైనికులు పాల్గొన్నారు.