కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన పంతం నానాజీ

కాకినాడ, తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో కరప గ్రామం కొత్తపేట ప్రాంతంలో జనసేన నాయకులు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ స్వగృహంలో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి చవ్వాకుల సందీప్, జనసేన సీనియర్ నాయకులు బోగిరెడ్డి కొండబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, గ్రామ అధ్యక్షులు పేకేటి ప్రసాద్, కరప మండలం ఉపాధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, మండల ప్రధాన కార్యదర్శి పేపకాయల పవన్ కుమార్, జిల్లెళ్ల ప్రసాద్, పేపకాయల వెంకటరమణ, బిరుద బాబు, నల్లే ప్రసన్న, బండారు మణికంఠ, నక్క అంజి మరియు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.