బీసీలకు ప్రత్యామ్నాయం జనసేన పార్టీ: బొమ్మిడి నాయకర్

నరసాపురం, ది.11-03-2023 మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని పార్టీ అధిష్టానం ఇప్పటికే తెలియజేసి ఉన్నారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ బీసీలకు ప్రత్యామ్నాయ పార్టీ అలాగే బీసీల సంక్షేమ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క జనసేన పార్టీనే అని ఒక ప్రకటనలో తెలియజేశారు.