జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును కలిసిన అమలాపురం నేతలు

డా.బి ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొణిదెల నాగబాబుని హైదరాబాద్ లో జనసేన అమలాపురం పార్లమెంట్ నేత డిఎమ్ఆర్ శేఖర్ అధ్వర్యంలో అమలాపురం జనసేన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబుని కలిసిన వారిలో అమలాపురం మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ యాళ్ళ నాగసతీష్, ఇసుకపట్ల రఘుబాబు, లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, పడాల నానాజీ, పోలిశెట్టి బాబులు, ఉండ్రు భగవాన్ దాస్, ఆర్డిఎస్ ప్రసాద్, వాకపల్లి వెంకటేశ్వరరావు, కంకిపాటి గోపి, గంధం శ్రీను, నల్లా వెంకటేశ్వరరావు, పాలూరి స్వామి, అల్లాడి రవి తదితరులున్నారు.