చిత్తూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

డా.బి.ఆర్.అంబెడ్కర్ గారి 131 జయంతి సందర్బంగా తిరుపతి పట్టణంలోని బస్టాండ్ దగ్గర అంబెడ్కర్ విగ్రహానికి జనసేన పి.ఎ.సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డా.హరి ప్రసాద్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంబెడ్కర్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను ఎప్పుడూ.. పాటిస్తుంటారని, అణగారిన వర్గాలకు బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడూ.. జనసేన తోడుగా ఉంటుందని తెలియజేశారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు కలిసి మెలసి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శిలు ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కార్యదర్శిలు పగడాల మురళి, జిల్లా కమిటీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కంచి శ్యామల, జిల్లా కమిటీ కార్యదర్శిలు ఆనంద్, జనసేన సీనియర్ నాయకులు కృష్ణయ్య, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, పట్టాన కమిటీ కార్యదర్శిలు పగడాల లోకేష్, చెన్నారెడ్డి కాలనీ దిలీప్, కుమార్, దిలీప్ రాయల్, కిరణ్, రవి, పురుషోత్తం, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.