సంస్కరణలకు ఆద్యుడు అంబేద్కర్‌: గురాన అయ్యలు

విజయనగరం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని జనసేన నేత గురాన అయ్యలు కొనియాడారు. అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం వారి కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వారి ఆశ‌యాల‌ను సాధించ‌డ‌మే ఆయ‌న‌కు మనం ఇచ్చే నిజ‌మైన నివాళిగా పేర్కొన్నారు. డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ చేసిన కృషి వల్లే దేశానికి గొప్ప రాజ్యాంగం సమకూరిందన్నారు. అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఏంటి రాజేష్, మేడేపల్లి పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, గవర శంకర్రావు, కంది సురేష్ కుమార్, కంకిపాటి రాజు, గొల్లపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.