అమ్మిశెట్టి శ్రీరామమూర్తిని అభినందించిన గాదె

వేమూరు నియోజవర్గం: చుండూరు మండలం, మున్నంగి వారి పాలెంలో జనసేన పార్టీ చుండూరు మండల జనసేన అధ్యక్షులు అమ్మిశెట్టి శ్రీరామ్ మూర్తి సర్పంచ్ అభ్యర్థిగా తమ ప్రత్యర్థి అధికార పార్టీ అభ్యర్థిపై 63 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు సర్పంచ్ అభ్యర్థి అమ్మిశెట్టి శ్రీరామమూర్తిని మరియు ఆయన గెలుపుకు సహకరించిన జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, గ్రామస్తులను మున్నంగి వారి పాలెంలో అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. వేమూరు నియోజవర్గంలో జనసేన పార్టీ గెలుపు మున్నంగి వారి పాలెం నుంచి ప్రారంభమైందని, 2024లో జరగబోయే ఎన్నికల్లో వేమూరు నియోజవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేదానికి ఈ సర్పంచ్ ఎలక్షన్లు నిదర్శనమని, రాబోయే ఎలక్షన్స్ లో ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టి, ముఖ్యమంత్రిగా చేసుకుంటారని తెలియజేశారు.