పెళ్లి బృందానికి ప్రమాదం బాధాకరం

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన జనసేన నాయకులు

మార్కాపురం: ప్రకాశం జిల్లా దర్శి వద్ద సాగర్ కాలువలో పెళ్లి బృందం బస్సు పడిపోయిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం, అదేవిధంగా ప్రభుత్వం వారి కుటుంబాలకు సహాయపడాలని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి రాయని రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, జిల్లా లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ శైలజ, జనసేన నాయకులు శిరిగిరి శ్రీనివాసులు, జహీర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.