వాలంటీర్ లు ఆత్మపరిశీలన చేసుకోవాలి

  • వాలంటీర్ తీరుని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం

పూతలపట్టు నియోజకవర్గం: బంగారుపాళ్యం మండలం, బంగారుపాళ్యం జనసేన కార్యాలయంలో మండాలాధ్యక్షుడు కోడి చంద్రయ్య ఆధ్వర్యంలో వాలంటీర్ తీరుని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి మరియు మండల కమిటీ సభ్యులు మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్క వాలంటీర్ ఎవరికి వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో పూర్తిగా చూసి, విని తెలుసుకోకుండా వైసిపి నాయకులు చెప్పిన మాటలు నమ్మి మా నాయకుడిని అవమానించడం మీ యొక్క కుసంస్కారానికీ తార్కాణం అని అన్నారు. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వారు మాట్లాడే ప్రతి మాటను వక్రీకరించే బుధ్ధి వైసిపి నాయకులది. అలాంటి వారి మాటలు విని మీ వేలితో మీ కన్ను మీరే పొడుచుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, పెద్ద పెద్ద డిగ్రీలు చదివి వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారని మీ పైన వుండే కనీసం జాలి కూడా ప్రజలకు పోతుంది ఇలాంటి చర్యలు వలన అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.