గర్భాన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ పంపిణీ కార్యక్రమం

పాలకొండ నియోజకవర్గం: పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఈరోజు పాలకొండ మండలం చిన్నమంగలాపురం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద మనసుతో జనసైనికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ క్రియాశీలక బీమా పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గర్భాన సత్తిబాబు అన్నారు. ఒక్కొక్క క్రియాశీలక సభ్యులు 10 మందిని ప్రభావితం చేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసే విధంగా పని చెయ్యాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తమ జనసైనికులకు అండగా నిలవాలని 5 లక్షల రూపాయలు పథకాన్ని ఏర్పాటు చేశారని, దేశ చరిత్రలో ఏ నాయకుడు కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని గర్భాన సత్తిబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సామాజిక న్యాయం సాధ్యమని ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.