పారిశ్రామిక అభివృద్ధే ప్రధాన లక్ష్యం: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటి రేగ మండలంలో మంగళవారం నెల్లిమర్ల భాజపా అసెంబ్లీ కన్వీనర్ బుర్లె శ్రీధర్ ఆధ్వర్యంలో బిజెపి, జనసేన, టీడీపి ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవికి పూర్తిస్థాయిలో మద్దతిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాధవి మాట్లాడుతూ మూడు పార్టీలు కలిసి పనిచేసే ఈ దుర్మార్గం పలనను అంతం చేయాలని, నెల్లిమర్ల నియోజకవర్గంని పారిశ్రామిక అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దాలన్నదే తన అంతిమ లక్ష్యం అని అది తాను చేసి తిరుగుతానని తనకు సహకరించడానికి వచ్చిన బిజెపి నేతలు కార్యకర్తలకు మాధవి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సమావేశంలో బూర్లే శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి అరాచక పాలన నుంచి విముక్తి పొందాలి అంటే రాష్ట్రంలో కూటమి గెలుపు ఎంతో అవసరమని అదే విధంగా నెల్లిమర్ల అసెంబ్లీ బిజెపి జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి గారిని గెలిపించాలని భాజపా నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.