కొల్లు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, గొంది గ్రామం మాజీ సర్పంచ్ కొల్లు సోమలమ్మ కుమారుడు కొల్లు శ్రీనివాస్ కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు కలసి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుండుబోగుల పెద కాపు, తాడి మోహన్ కుమార్, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, గుబ్బల రవి కిరణ్, పినిశెట్టి బుజ్జి, జక్కంపూడి శ్రీను శ్రీదేవి, రావూరి నాగు, కొల్లు వెంకట్ రాజు, కొక్కిరిగడ్డ శ్రీను, కారడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.