డా.హరిప్రసాద్ ఆధ్వర్యంలో అరణి శ్రీనివాసులుకు అపూర్వ స్వాగతం

తిరుపతి, జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులుకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సింగాల గుంటలో శనివారం తిరుపతి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అభ్యర్థి అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అభివృద్ధి బాట పట్టించాలంటే తమను గెలిపించాలని కోరారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి టీడీపీ-బీజేపీ లతో కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి పూనుకున్నారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రార్టీ అధినేత ప్రజల బాగుకోసం మాత్రమే కొన్ని మెట్లు తగ్గారన్నారు. ఉమ్మడి అభ్యర్థి విజయమే రాష్ట్రంలో ఆరాచక పాలనకు చరమగీతం పాడుతుందన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యం అన్నారు. అధినేత నిర్ణయించిన వ్యక్తిని తిరుపతి నుంచి గెలిపించి కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చందు, రాజేష్ యాదవ్, భాను, కృష్ణయ్య, ఆనంద్, కుమార్, దిలీప్ సుబ్రహ్మణ్యం, మధులత, దివ్య, శిరీష, లక్ష్మి, కోకిల, జయంతమ్మ, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.