గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐకి రామగుండం జనసేన పిర్యాదు

రామగుండం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పిలుపు మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తెలంగాణా రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తున్న క్రమంలో సోమవారం రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ సూచనల మేరకు రామగుండం మండల ప్రధాన కార్యదర్శి ఎముర్ల రంజిత్ స్థానిక గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐకి పిర్యాదు చెయ్యడం జరిగింది. వారి వెంట జనసేన మండల నాయకులు మోతె రవికాంత్, బండారి తిరుపతి, చెట్టి రాజశేఖర్, నరేష్, లోకేష్, కుర్మా అజయ్ తదితరులు పాల్గొన్నారు