ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 19వ రోజు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, రంగాచార్యుల కండ్రిగ గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 19వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రంగాచార్యుల కండ్రిగ గ్రామంలో జనసేన దృష్టికి స్థానిక సమస్యను తీసుకొస్తూ గ్రామంలోని వృద్ధ దంపతులు మాట్లాడుతూ మా ఇంటి ముందు డ్రైనేజ్ కాలువ నిర్మాణం చేస్తామని సంవత్సరం ముందు కాలువ తవ్వి ఇప్పటి వరకు నిర్మించలేదు. స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని, ఇంటి ముందు రోతగా, అపరిశుభ్రంగా ఉంటూ వీధిలో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందంటూ వారి ఆవేదనని జనసేన నాయకుల ముందు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాండ్ర శ్రీను, శశి వర్ధన్ పాల్గొన్నారు.