ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 23వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పిడతాపోలూరు పంచాయతీ, సీతారెడ్డి తోటలు గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 23వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా
ముత్తుకూరు మండలంలోని సీతారెడ్డి తోటలు గ్రామంలో జనసేన నాయకులు కరపత్రాలు పంచుతూ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధికి ఏవిధంగా కృషి చేస్తుందని తెలియజేసి, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయిన “గాజుగ్లాసు” కు ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఒక వయోవృద్ధ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మేము గత ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా ఉన్నామని నాకు పింఛన్ రాకుండా నిలిపివేసారని, నా కొడుకు ఇల్లు కట్టుకుంటే ఇంటి బిల్లులు కూడా ఇవ్వలేదని వారి బాధనను జనసేన నాయకులు ముందు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాళహస్తి గిరిధర్, తాండ్ర శ్రీను, మనుబోలు మాధవ్ కృష్ణ, ఎస్.కె సందాని తదితరులు పాల్గొన్నారు.