కొత్తకోడూరు బీచ్ రోడ్డు దుస్థితిపై జనసేన నిరసన

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలంలో అధ్వాన్నంగా ఉన్న కొత్తకోడూరు బీచ్ రోడ్డు దుస్థితిపై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం జనసేన నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు ప్రజల చేత ఓట్లు వేసుకొని గెలిచి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి, మూడున్నర సంవత్సరం నుంచి అధికారపక్షంలో ఉంటూ ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత కూడా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లన్నీ పట్టించుకోకపోగా, సర్వేపల్లి నియోజకవర్గంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే కొత్తకోడూరు బీచ్ కి వెళ్లేటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా ఉంటే ఆ రోడ్డుపై ఉన్న గుంటలని పూడ్చాలనే ఆలోచన కూడా లేకపోవడం దారుణం. అదే విధంగా పర్యటక శాఖకు సంబంధించిన కొత్త కోడూరు బీచ్ ని కనీస వసతులు కూడా లేక అక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో ఇబ్బందులు పడుతుంటే, పర్యటక శాఖ మంత్రి రోజా గారు డైమండ్ రాణిగా చలామణి అవుతూ స్టేజీలపై డ్యాన్స్ వేసుకునే దానికి సమయం కేటాయిస్తుంది. కానీ వేలాదిగా వచ్చే కొత్తకోడూరు బీచ్ ని పర్యటక శాఖలో భాగంగా ఎందుకు అభివృద్ధి చేయలేదు..? ఎందుకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా డైమండ్ రాణి రోజా మా అధినేత గురించి విమర్శించడం మానేసి ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతలను ఆమెకి ఇచ్చినటువంటి శాఖ మీద దృష్టి పెట్టలేని గౌరవపదంగా మీడియా పూర్వకంగా డైమండ్ రాణికి తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రహీం, శ్రీహరి, అక్బర్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.