భారీ వర్షంలో 19వ వారం ఘనంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి జ్యోతుల శ్రీనివాసు జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గము వారు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయ సదుపాయమును కల్పించుచున్నారు. 19వ వారం బారీవర్షంలో కూడా శనివారం 650 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు అన్నపానీయాలను రైతులకు, పశువుల అమ్మకం మద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, బాబురావు, అల్లం శ్రీను, రవి, నక్కా మణికంఠ, బొత్స శ్రీకాంత్, పోట్టినురి గణేష్, ఇప్పర్తి శీను, జ్యోతుల నాని తదితరులు ఆహరం వడ్డనలో తమ సేవలను అందించారు. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రమునకు శ్రమదానం సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలియజేశారు.