డా. పసుపులేటి హరిప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దారం అనిత

జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు, బోధ్ హాస్పిటల్స్ అధినేత డా. పసుపులేటి హరిప్రసాద్ జన్మదినం సందర్భంగా.. గురువారం మదనపల్లి నియోజక వర్గం జనసేన నాయకుల తరపున, జనసైనికుల తరపున, వీర మహిళల తరపున, మెగా ఫ్యామిలీ అభిమానుల అందరి తరపున చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, పసుపులేటి హరిప్రసాద్ ను కలసి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని, కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెన్నంటి వుండాలని దారం అనిత కోరారు.