ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించిన అంకె ఈశ్వరయ్య

అనంతపురం అర్బన్: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫుడ్ పాయిజన్ అయిన సింగనమల కేజీబీవీ విద్యార్థినిలకు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో పరామర్శించిన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి ముప్పూరి కృష్ణ. శింగనమల మండల కేంద్రములోని కస్తూరిభాయి స్కూలు నందు పుడ్ పాయిజన్ కు గురై దాదాపుగా 84 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. వారిలో కొంతమందిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి మరియు పావని హాస్పిటల్ కు తరలించిన విషయం తెలుసుకొని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మరియు పావని హాస్పిటల్ నందు చాలా ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించడం జరిగింది. అనంతరం పావని హాస్పిటల్ లో ఉన్న 9 మంది విద్యార్థినులకు ప్రభుత్వమే వైద్యసేవలు సమకూర్చాలని డి.ఎం.హెచ్.ఓ కు వినతిపత్రం అందచేయడం జరిగింది. అనంతరం డి.ఎం.హెచ్.ఓ డా.యుగంధర్ తో కలిసి పావని హాస్పిటల్ లో ఉన్న విద్యార్థులను పావని హాస్పిటల్ డా.గుత్తా రవీంద్ర పర్యవేక్షణలో వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ముప్పూరి కృష్ణ, జనసేన నాయకులు సిర్రప్పాగారి భాస్కర్, అజయ్ కుమార్, నవీన్ కుమార్, గిరీష్, అరుణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.