భూపాలపట్నంలో పలువురు బాధితులకి ఆర్థిక సహాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మీ

రాజానగరం నియోజవర్గం(మండలం), భూపాలపట్నం గ్రామంలో… రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ పర్యటించి పలువురు బాధితు కుటుంబాలను పరామర్శించి, కొందరికి ఆర్థిక సహాయం అందించారు… వారిలో బోయిడి గంగరాజు ప్రమాదవశాత్తు గాలికి గాయం కాగా వారిని పరామర్శించి, వైద్య ఖర్చు నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.. అదే గ్రామానికి చెందిన తూము త్రిమూర్తులు భార్య సూర్యకాంతం కు గుండె సంబంధిత ఆపరేషన్ జరగగా వారిని వారి గృహం నందు పలకరించి వారి ఆర్థిక పరిస్థితిల దృష్ట్యా 5,000 /- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.. మరొక చోట బైక్ ఆక్సిడెంట్ గురై కాలుకు ప్యాక్చర్ గురైన పంతం నాగేశ్వరరావు ను పలకరించి ప్రస్తుత పరిస్థితి పై ఆరా తీసి పలకరించడం జరిగింది.. పై కార్యక్రమాల్లో సీనియర్ నేత, భూపాలపట్నం సర్పంచ్ బుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, బోయిడి వెంకటేష్, వేగిశెట్టి రాజు, నాతపాం దొరబాబు, తోట అనిల్ వాసు ఇతర నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.