ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిదే విజయం:ఖుష్బూ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి విజయం సాధిస్తుందని స్థానిక చేపాక్కం – ట్రిప్లికేన్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, సినీ నటి ఖుష్బూ ధీమా వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్‌ ప్రాంతంలో రాష్ట్ర బీజేపీ తరఫున ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర బీజేపీ కో-ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర మత్స్యశాఖ అధ్యక్షుడు సతీష్‌కుమార్‌, ఖుష్బూ, పార్టీ నేతలు స్థానిక ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ట్రిప్లికేన్‌లో ప్రసిద్ధిచెందిన పురాతన తిరువట్టీశ్వరన్‌ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, రాజస్థానీ తలపాగా ధరించి ఊరేగింపుగా వెళుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.