మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో అన్న ప్రసాద సమర్పణం

రాజంపేట నియోజకవర్గంలోని అత్తిరాలలో మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ భక్తులకు అన్న ప్రసాదం అందించబడింది. ఈ సందర్భంగా భక్తులను యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అత్తిరాల శివయ్యను రాజంపేట మరియు ఉమ్మడి కడప జిల్లాలోని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించడం జరిగింది. ఆలయ కమిటీ వారు అన్ని వసతులను కల్పించి ఎలాంటి అసౌకర్యం లేకుండా దైవ దర్శనం జరిపించాలని కోరడం జరిగింది. ఈ అన్న ప్రసాద్ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భాస్కర్ పంతులు, వీరయ్య ఆచారి, చౌడయ్య, శ్రీనివాసులు, కిషోర్, గోవర్ధన్, నవీన్, సుబ్రహ్మణ్యం, జనసేన వీరమహిళలు జడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.