పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండలము కించుమండ పంచాయితీలో అరకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీఐ జీడి బాబు, డుంబ్రిగూడ మండలంలో ఉన్నటువంటి ఎస్సై సంతోష్ కుమార్ మరియు పోలీస్ శాఖలతో అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. గిరిజన మన్య ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు, ముఖ్యంగా యూత్ గంజాయికి గాని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గంజాయి విక్రయించటం, అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రాణాన్ని వరకు తెచ్చుకోకుండా మైనర్ యువకులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా ఉండడానికి అలాగే గిరిజన ప్రాంతంలో గాని ప్రమాదాలు జరగటం ఎక్కువ కావున ప్రతి ఒక్క గిరిజనుడు అవగాహనా కార్యక్రమంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ కార్యక్రమంలో బంగారు రామదాసు అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు అలాగే గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.