పిడుగు భరత్ యాదవ్ ఆధ్వర్యంలో సహృదయ అనాధ ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం

హనుమకొండ, శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్బంగా హనుమకొండ జిల్లా 11వ డివిజన్ జన్జనసేన పార్టీ నాయకులు పిడుగు భరత్ యాదవ్ ఆధ్వర్యంలో సహృదయ అనాధ ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. మరియు సహృదయ అనాధ ఆశ్రమం యొక్క యాజమాన్యం గౌరవనీయులైన శ్రీమతి యాకుబీ ని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గొల్ల రాజేంద్ర ప్రసాద్ మరియు 11వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు పిడుగు భరత్ యాదవ్ లు సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో హాజరైన జనసైనికులు పిడుగు రంజిత్ యాదవ్, సాయి యాదవ్, విజయ్ గౌడ్, కిషోర్ యాదవ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.