జనసేన ఆధ్వర్యంలో సమస్య పరిష్కార అర్జీ నిరాకరణ దినోత్సవ నిరసన

అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండలంలోని ఉత్తరచిరువోలులంక గ్రామంలో గత సంవత్సరం అనుమతి లేకుండా అక్రమంగా జరిపిన ఇసుక, బసక, మట్టి తవ్వకాలపైన మరియు అలాగే మోపిదేవి నుండి రావివారిపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న ఎస్టీ లేఔట్ లో జరిగిన అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని అర్జీలు సమర్పించి సంవత్సరం గడిచినా పరిష్కరించకపోవడంతో మోపిదేవి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ అధ్యక్షతన అర్జీల పరిష్కార నిరాకరణ దినోత్సవంగా వినూత్న రీతిలో కేకు ను కట్ చేసి నిరసన తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణాజిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు మాదివాడ వెంకట కృష్ణ, బాదర్ల లోలాక్షుడు నాయుడు, సుధాని నందగోపాల్, బోగిరెడ్డి సాంబశివరావు, కేతరాజు రామకృష్ణ, కేతరాజు వల్లి, యర్రంశెట్టి సునీల్, మత్తి వంశీ, మత్తి శివనంది, అరజా కాంత్, భోగాది లంకేశ్వర రావు, యోగేష్, రాఘవ కూరేటి పాల్గొన్నారు.