అనుశ్రీ సత్యనారాయణ, అల్లాటి రాజుల ఔదార్యం

  • కష్టాలలో ఉన్న జనసేన కార్యకర్తకి సాయం

రాజమహేంద్రవరం, కష్టాలలో ఉన్న జనసేన కార్యకర్తను ఆ పార్టీ నాయకులు ఆదుకున్నారు. స్థానిక 47వ వార్డు టి.వి రోడ్ కి చెందిన జనసేన పార్టీ కార్యకర్త దొమ్మేటి దుర్గాప్రసాద్ ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కూలిపనికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న విషయం పార్టీ నాయకుల దృష్టికి రావడంతో వారు స్పందించి సాయం చేశారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర కమిటీ కార్యదర్శి అల్లాటి రాజు స్పందించారు. దొమ్మేటి దుర్గాప్రసాద్ ఇబ్బందుల గురించి జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనితో ఆయన స్పందించి పదివేల రూపాయలను స్వయంగా వచ్చి దుర్గాప్రసాద్ కి అందచేశారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర కమిటీ కార్యదర్శి అల్లాటి రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిత్యావసర వస్తువులను దుర్గాప్రసాద్ కుటుంబానికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గెడ్డం నాగరాజు, గుత్తుల సత్యనారాయణ, వీరబాబు, గుణం.శ్యామసుందర్, విన్న వాసు, ఫణి, జి.రాము, రాంబాబు, అయోధ్యుల, సురేంద్ర, సాయి, రవి, బోడపాటి ప్రశాంత్, జగదీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.