పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు

ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ను కలిశారు. తాను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పవన్ ను సోము వీర్రాజు కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వీర్రాజుకు శాలువా కప్పి పవన్ అభినందించారు. అనంతరం ఇరువురు కలిసి పలు విషయాలపై చర్చించారు. రానున్న రోజుల్లో ఇరు పార్టీలు ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఏపిలో జనసేన, బిజెపిలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.