అసెంబ్లీ స‌మావేశాల్లోనే ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌?

తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీపై ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వంలో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఈ మేరకు శాఖ‌ల‌వారీగా ఖాళీల స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్‌ను సీఎం ఆదేశించార‌ని స‌మాచారం.

తొలుత ఉద్యోగుల‌కు పీఆర్సీ, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపుతో పాటే ఉద్యోగాల భ‌ర్తీపైనా ప్ర‌క‌ట‌న చేయాల‌ని కేసీఆర్ భావించిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే ప్ర‌భుత్వ ఉద్యోగా ఖాళీల వివ‌రాలు డిసెంబ‌ర్ వ‌ర‌కే అందుబాటులో ఉండ‌టంతో ఆగిపోయార‌ని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉద్యోగాల ఖాళీల వివ‌రాలు ఇవ్వాల‌ని కేసీఆర్ కోరిన‌ట్టుగా చెప్తున్నారు. ఆ వివ‌రాలు రాగానే రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న‌ది ఉన్న‌తాధికారుల మాట‌.