ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్- 7వ రోజు జనసేన విజయ యాత్ర

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ జనసేన విజయ యాత్ర 7వ రోజు ” కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం, సాయి బాబా గుడి కాలనీ వినాయక్ నగర్ లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరిస్తూ, వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరిస్తూ, పథకాల పేరిట వైసీపీ చేస్తున్న దోపిడీని ప్రజలు వివరించడం జరిగింది. శ్రీకాళహస్తి లో ఎమ్మెల్యే అనుచరులు టైలర్ కాలనీలో ప్లాట్లను కబ్జాలు చేశారని కొంత మంది మహిళలు తెలిపారు. జనసేన – టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తంలో వైసీపీ లో కబ్జాలకు గురైన ప్రతి సెంటును వెన్నక్కి తీసి బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, పట్టణ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, వీర మహిళలు లక్ష్మి, శారద, బతెమ్మ, నిర్మల నాయకులు, గురవయ్య, రాజేష్, సురేష్, రామ్ జనసైనికులు చిన్న మునయ్య, శబరి, రాజేష్, మదు, శీను, హేమంత్, వెంకీ, భాను తదితరులు పాల్గొన్నారు.