ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్- జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 24వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, పాపానాయుడు పేట పంచాయతీలో ఆదివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ, టీడీపీ కార్యకర్తలు పాల్గొని వినుతకు ఆహ్వానం పలికారు. పాపానాయుడు పేట అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్లు సరిగా లేవని, రేణిగుంట నుండి పాపానాయుడు పేట వచ్చే రోడ్డు దారుణమైన స్థితిలో గుంటలమయం అయ్యిందని ప్రజలు తెలిపారు. పాపానాయుడు పేటను మండలం చెయ్యాలని, పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు జాఫర్, రవి, భాష శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు వంశీ, భాను, నితీష్, వినోద్, కవిత, శారద, రాజ్య లక్ష్, లక్ష్మి, చిరంజీవి, సురేష్, రాజేష్, మునయ్య జనసైనికులు దినేష్, గోపి, కళ్యాణ్, బబ్లూ, నిరంజన్, తిరుమల, వెంకటేష్, లక్ష్మయ్య, మౌళి, లోకేష్, రాజ తదితరులు పాల్గొన్నారు.