పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం అర్జున్ నగర్ కి వైసీపీ యువత, మహిళలు స్థానిక జనసేన నాయకులు తాటిమల్ల రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు టేకుముడి శ్రీను, గుబ్బల రమణ, నాయకత్వంలో సుమారు 100 మంది జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానం పలికారు. చేరిన వారిలో వేముల చిరంజీవి, బొడ్డు ప్రకాష్, వాసంశెట్టి వరప్రసాద్, పిల్లి మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.