ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 15వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, కందాడ పంచాయతీలోని, కందాడ, కందాడ హరిజనవాడ, యస్.టి.కాలనీ, చెన్నప్ప గుంట యస్.టి.కాలనీ రాచపాలెం గ్రామంలో ఆదివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి,అక్రమాలను , దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని , తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. ఓటు వేసి గెలిపించినందుకు వైసీపీ పార్టీ ఒక్క పని కూడా చెయ్యలేదు అని గ్రామంలో పలు సమస్యలు సి. సి రోడ్లు , డ్రైనేజీ కాలువలు , స్ట్రీట్ లైట్లు , పారిశుధ్యం తదితర సమస్యలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు వినుత మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, నితీష్ కుమార్, లోక రాయల్, మునిశేఖర్, నాయకులు, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, శారద, రవి కుమార్ రెడ్డి, చిన్న మునయ్యా, పేట చిరంజీవి, పేట చంద్ర శేఖర్, జ్యోతి రామ్, రాజేష్, సురేష్, సూర్య జనసైనికులు, వంశీ, రాజశేఖర్, దినేష్, గోపి, ఈశ్వర్ తదితరులు మరియు స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.