జనసైనికుని పై రౌడీషీట్ ఎత్తివేయాలని ఎస్పికి వినతిపత్రం

టెక్కలి జనసైనికుడు మెట్ట అవినాష్ పై ఇటీవల నమోదు చేసిన రౌడీషీట్ ను ఖండిస్తూ నేడు శ్రీకాకుళంలో జరిగిన స్పందన గ్రీవిన్స్ లో టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో అమూదాలవలస ఇంచార్జ్ రామ్మోహన్, పాతపట్నం ఇంచార్జ్ చైతన్య, శ్రీకాకుళం ఇంచార్జ్ సర్వేశ్వరరావు లు జిల్లా ఎస్పి శ్రీమతి రాధికని కలసి తమ నిరసనను తెలియజేసి వెంటనే అవినాష్ పై రౌడీషీట్ ను రద్దు చేయాలని కొరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు విశ్వక్సేన్, గురు ప్రసాద్, కొండా ఉదయ్, యాదవులు, హరి తదితరులు పాల్గొన్నారు.