ఏపీ ప్రజలకు గమనిక: బ్యాంక్ పనివేళల్లో మార్పులు

ఏపీలో కరానా రోజు రోజుకూ వివిజ్రుంబిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల ప్రభావం బ్యాంకులుపై కూడా పడింది. బ్యాంక్ ఉద్యోగులు కూడా అక్కడక్కడా ఈ వైరస్ బారినపడుతున్నారు. అలాగే ఆంక్షలు అమల్లో ఉండటంతో దానికి తగ్గట్లుగా జిల్లాలవారీగా బ్యాంకు పనివేళల్లో మార్పులు చేశారు. ప్రకాశం జిల్లాలో నేటి నుంచి బ్యాంకులకు ఆంక్షలను జిల్లా అధికార యంత్రాంగం అమలు చేయనుంది. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. కృష్ణా జిల్లాలో కూడా ఇవే నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ మార్పులు చేశారు. ప్రజలు గమనించి తమకు సహకరించాలని బ్యాంకులు కోరుతున్నాయి.