అప్పారావుకి జనసేన తరుపున గురుదత్ ఆర్థికసాయం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, రాజానగరం గ్రామనికి చెందిన నువ్వుల అప్పారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు అనే వార్త జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ తరుపున ₹5,000 రూపాయలు జనసైనికుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఐటి – కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, తూర్పుగానుగుడెం & ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు, రాజానగరం మండలం మన్య సీనియర్ లీడర్ మన్య నాగు, రాజానగరం మండలం జనసేన పార్టీ సీనియర్ లీడర్ తోట శివ(మీసేవ), పల్లా హేమంత్, మెడిద వీరబాబు, ప్రగాడ బాలాజీ, వల్లేపల్లి రాజేష్, కామిరెడ్డి పెద్దకాపు చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.