జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ కమిటీ ప్రకటన..

అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ కమిటీని కమిటీ సభ్యుల వివరాలని బుధవారం అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకట్నాథ్, మరియు అవనిగడ్డ జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి చేతుల మీదగా అవనిగడ్డ టౌన్ పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భోగాది రాజ్యలక్ష్మి, ఆళ్ళమళ్ళ చందు బాబు, అన్నపరెడ్డి ఏసుబాబు, వి వినాయక్ తదితర జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.