జనసేన మండల అధ్యక్షుల నియామకం

మైలవరంనియోజకవర్గం: ఇబ్రహీంపట్నం మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మైలవరంనియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో అన్ని గ్రామాల్లో అధ్యక్షుల నియామకాలు జరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మరియు మైలవరంనియోజకవర్గం ఇన్చార్జి అక్కల రామమోహన్ రావు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం గ్రామ పార్టీ అద్యక్షుడు పోలిశెట్టి తేజా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగా పార్టీ అద్యక్షుపదవులను స్వికరించిన వివిధ గ్రామాల అధ్యక్షులు తుమ్మలపాలెం గ్రామ పార్టీ అద్యక్షుడిగా చెల్లు కోటేశ్వరరావు, ఉపాద్యక్షుడిగా శీలం నరేష్ నియమితులయ్యారు. మూలపాడు గ్రామ పార్టీ అద్యక్షుడిగా తుంగం కుమారి ఉపాద్యక్షుడిగా చెరుకూరి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. జూపూడి గ్రామ పార్టీ అద్యక్షుడిగా కాకి బాబూరావు, ఉపాద్యక్షుడిగా రెంటపల్లి విల్సన్ నియమితులయ్యారు. కేతనకొండ అద్యక్షుడిగా కొమ్మూరు వెంకటస్వామి, ఉపాద్యక్షుడిగా పగడాల శ్రీనివాసరావు నియమితులయ్యారు.. కొటికలపూడి గ్రామ పార్టీ అద్యక్షుడిగా పెయ్యాల పోతురాజు, ఉపాద్యక్షుడిగా అర్జా పోతురాజు నియమితులయ్యారు. దాములూరు గ్రామ పార్టీ అద్యక్షుడిగా పంది శ్రీను, ఉపాద్యక్షుడిగా పూమకంటి రాజేష్ నియమితులయ్యారు. కాచవరం గ్రామ పార్టీ అద్యక్షుడిగా షేక్ గాలిసైదా నియమితులయ్యారు. ఈలప్రోలు గ్రామ పార్టీ అద్యక్షుడిగా కూరగంటి గోపాలకృష్ణ, ఉపాద్యక్షుడిగా బండి కృష్ణ కిషోర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మైలవరంనియోజకవర్గం ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగ్గుభాయ్ నీ నోరు అదుపులో పెట్టుకో నీవల్ల రాష్ట్ర ప్రజలందరికీ మీబ్రతుకులు తెలుసు అంటూ హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం గ్రామ పార్టీ అద్యక్షుడు పోలిశెట్టి తేజ మాట్లాడుతూ మైలవరంనియోజకవర్గం లో మొట్టమొదటి సారిగా మన ఇబ్రహీంపట్నం మండలం లో దాదాపుగా అన్నిగ్రామాల్లో జనసేన పార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. జిల్లా సంయుక్త కార్యదర్శి చింతల లక్ష్మీ కుమారి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రైతులందరికీ ఇన్సూరెన్స్ చేయిస్తానని అన్నవిషయం మరిచిపోవడంవల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రకృతిసహకరించకపోవటంవల్ల ఆరుగాలం పండించిన పంటలు చేతికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బొల్ల సతీష్, కలక అశోక్, పుర్రం సురేష్, హరి కిషోర్, కోటేశ్వర రావు, జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.