అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగల మండలం, ఉప్పలపాడు గ్రామంలో ఇటీవల తాటాకు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. సోమవారం జనసేన పార్టీ రంపచోడవరం నియోజవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం కాలి పోయిన ఇల్లుని సందర్శించి 3000 రూపాయలు రాజశేఖర్ రెడ్డి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కొణతం శ్రీనివాస్, పొడుగు సాయి, మణికంఠ, అప్పాజీ, వెంకన్న, వెంకటేష్, అంజి, రాజ్ కుమార్, బద్రి, వెంకటరమణ, గంగవరం మండలం సీనియర్ నాయకులు గణేష్, రాజేష్, చంద్రశేఖర్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.