జనసేన పార్టీ హుస్నాబాద్ మండల కమిటీ నియామకం

హుస్నాబాద్: జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు హుస్నాబాద్ మండల కమిటీని నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన రాజకీయ విప్లవానికి జనసేన బీజం వేసిందన్నారు. సామాన్య యువతను నాయకులుగా మారుస్తూ జనసేన రాజకీయం చేయబోతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్ది పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నూతన కార్యవర్గం అధ్యక్షులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడ్య అనిల్, సోషల్ మీడియా సెక్రటరీ రెడ్డి గోపినాథ్, సెక్రటరీ దండుగుల రాజు తదితరులు ఉన్నారు.