డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలకు అనూహ్యస్పందన

★ దక్షిణ నియోజకవర్గంలో వరుస పర్యటనలు
★ కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట – 108వ రోజు చేరుకున్న కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు చేపడుతున్న సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. అవసరమైన వారికి తన పరిధి మేరకు సహాయాన్ని చేస్తున్నారు. కొందరికి తన సొంత నిధులతో సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. తాను చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతుంది. ఈ కార్యక్రమం 108వ రోజుకు చేరినప్పటికి కూడా ఆయన పర్యటనలకు విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 33 వ వార్డు లో పెళ్లి కుమార్తె జోగులాంబకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందులు నాగరాజు మాట్లాడుతూ సాటివారికి సేవ చేయడం దైవ సేవతో సమానమని చెప్పారు. ప్రజాసేవ పరమావధిగా అభివర్ణించారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందు ఉండి వారికి అన్ని విధాలుగా తోడు ఉంటానని చెప్పారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజలందరూ తమ పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో ఆ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుల కృష్ణ, ప్రసాద్, మణికుమార్, శ్రీదేవి, కోదండమ్మ, దేవి, లక్ష్మి, కుమారి, దుర్గా, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.