బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో గుంతల రోడ్లపై నిరసన

  • బాడంగి మండలంలో గుంతల రోడ్లపై నిరసన

బొబ్బిలి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో జనసేన-టీడీపీ నాయకులు బాడంగి మండలంలో గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హాష్ టాగ్ #GunthalaRajyamAP #WhyAPHatesJagan లలో ప్రచురించారు. ఈ సందర్బంగా గిరడ అప్పలస్వామి మాట్లాడుతూ గుంతలమయం అయిన రోడ్లులో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహన కార్యదర్శి మహంతి ధనుంజయ బాడంగి మండల టీడీపీ నాయకులు ఎల్. శేషగిరి, జె.దాలినాయుడు మరియు జనసేన నాయకులు గొర్లె సాయి, ఎల్.గోవింద, పి.తవిటినాయుడు, ఎం.తిరుపతి మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • బొబ్బిలిలో గుంతల రోడ్లపై నిరసన

బొబ్బిలి, గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో నేడు బొబ్బిలిలో యమహా షోరూం ఎదురుగా ఉన్న గుంత వద్ద బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ రాంబర్కి శరత్ కుమార్, పారది జనసేన ఎంపీటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య, రామభద్రపురం మండల నాయకులు మహంతి ధనుంజయ మరియు జనసేన నాయకులు గండేటి శ్రీను, లెంక శంకర్, రామకృష్ణ వీర మహిళలు అలవేలు, వరలక్ష్మి, రామలక్ష్మిలు నిరసన తెలిపారు.

  • రామభద్రపురంలో గుంతల రోడ్లపై నిరసన

బొబ్బిలి, గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో శనివారం రామభద్రపురం గ్రామంలో ఏపిజివిబి బ్యాంకు ఎదురుగా ఉన్న గుంత వద్ద బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు రామభద్రపురం మండల నాయకులు మహంతి ధనుంజయ మరియు మండల జనసైనికులు నిరసన తెలిపారు.