మీరు కాపులా లేక కాపలా కుక్కలా..!! మీరు మంత్రులా లేక కంత్రులా..?

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించిన మంత్రులకు ఘాటుగా, ధీటుగా జనసేన జవాబు..

తిరుపతి, సోమవారం స్థానిక హోటల్ నందు మీడియా సమావేశంలో తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి కొత్తగా రెండు విషసర్పాలు వచ్చాయి ఒకరు వృద్ద బానిస అంబటి, మరొకరు యువ బానిస అమరనాథ్ లు, రాష్ట్రం లో కొత్త మంత్రి వర్గం విస్తరణ జరిగింది ఈ విస్తరణలో జగన్ జోకర్స్ పేర్ని నాని, కొడాలి నాని అనే జొకర్స్ వెళ్లిపోయారు, ఇపుడు వైసిపిలో కొత్తగా జగన్ బఫున్స్ వచ్చారు, మీరు మంత్రుల లేక కాపలా కుక్కలా? పోలవరం పూర్తి చేయాలంటే అంబటికి ఏమి తెలియదు పోలవరానికి సంజనా, సుకన్య అని పేరు పెడితే పోలవరం త్వరగా పూర్తి చేస్తారు, మీ నాయకుడు సీబీఐ దత్తపుత్రుడు అయితే, మీ మంత్రులు ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రులు ఆయన కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి చివరికి రేపు మీకు టిక్కెట్లు కావాలన్నా ఆయనే నిర్దేశించాలి కదా..

ప్రజలకు కాపలా కాయండి జగన్ కి కాపలా కుక్కల్లా ఉండొద్దు అని మంత్రులు చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు.

జిల్లా అద్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో మాఫియా ప్రభుత్వం నడుస్తోంది, మాఫియా హీరోగా సజ్జలను పెట్టారు, రాష్ట్రంలోని ఈ జోకర్ మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిండం ఏంటి, మినిస్ట్రీ గురించి సబ్జెక్ట్ లేని వారిని మంత్రులుగా నియమించారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ కాదు గజ్జల అని పిలవాలన్నారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తారా..? వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు ఉన్న మీ పార్టీ 15 సీట్లకు పరిమితం చేస్తాం, మా జనసేన వీరమహిళల జోలికి రావొద్దు వారి జోలికి వస్తే మీ ఫ్యామిలీతో కాపురాలు కూడా చేసుకోలేరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మీడియా సమావేశంలో జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి మరియు ముఖ్య నాయకులు బాబ్జి, పగడాల మురళి, వనజ, ముక్కు సత్యవంతుడు, సుమన్ బాబు, మునస్వామి, పార్ధు, ఆనంద్, హేమ కుమార్, అమృత, కీర్తన, కోకిల, కృష్ణయ్య, మనోజ్, రాజేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.