పాలాభిషేకం చేస్తే అరెస్టులా..?

గుంతకల్లు నియోజకవర్గం, మా నాయకుడు దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే అడ్డుపడని పోలీసులు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని పామిడి జనసేన మండల అధ్యక్షులు యం.ధనుంజయ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నాయకుడు దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే అడ్డుపడని పోలీసులు మా నాయకుడిని ప్రజల మధ్యన కించపరుస్తూ మాట్లాడుతుంటే అడ్డు చెప్పని పోలీసు వ్యవస్థ, మా నాయకుడిని అగౌరపరుస్తుంటే ఆ బాధను భరించక మా అధ్యక్షుల వారికి పాలాభిషేకం చేద్దామంటే కూడా పోలీసు వారి నిర్బంధం, పోలీసు వారి అరెస్టులా.. పాపం పోలీసు వారు కూడా పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఇలా ప్రతి చోట మమ్ములను అడ్డుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. పాలాభిషేకం చేయడమే నేటి సమాజంలో నేరం అన్నట్టు అరెస్టులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటిని ఖండించి, అధికారంలోకి వచ్చాక అంతకుమించి అధికార బలాన్ని ఉపయోగించి అణిచివేయాలని చూస్తున్నారు ఇది ఎల్లకాలం సాగదు. ఇక కొద్ది రోజుల్లో ప్రభుత్వాలు మారిపోతున్నాయి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని ధనుంజయ్ హెచ్చరించారు.